Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు   

 

బీసీలకు 42 శాతం రిజర్వేషలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా అంతరం డి టి దుగ్యాల సతీష్ గారికి మెమోరం అందజేయడం జరిగింది 

 

ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ తన మూల సిద్ధాంతంలోనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన రిజర్వేషన్లను మోడీ సర్కార్ అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు తెలంగాణ పట్ల మోడీ సర్కార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం ద్వారా స్థానిక సంస్థలతోపాటు విద్యా ఉద్యోగాల్లో ఉపాధిలో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఐక్య ఉద్యమాలు చేస్తామని పోరాటాల ద్వారానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమని అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని రాములు పిలుపునిచ్చారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ బీసీలు సకల జనులంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు  

 

ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు జుట్టు కుంట బసవయ్య బీసీ సంఘం నాయకులు బత్తుల ఉపేందర్ కోదాడ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా సిపిఎం నాయకులు దేవర వెంకటరెడ్డి సిపిఎం కోదాడ మండల నాయకులు మన్యం వెంకటయ్య పట్టణ కమిటీ సభ్యులు దాసరి శీను ఎస్.కె రహిమాన్ మరియన్న జంగాపల్లి సాయి వి రాముడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Related posts

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

నేరాలకు పాల్పడితే జైలు తప్పదు, కుటుంబంలో ఒక్కరూ జైలుకు వెళితే కుటుంభం చిన్నాభిన్నం అవుతుంది.

TNR NEWS

చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు

TNR NEWS

భక్తిభావంతోనే శాంతియుత సమాజం నెలకొంటుంది  18వ పడి నారీ కాయల తోకల సైదులు గురుస్వామి

TNR NEWS