పిఠాపురం : పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం నందు మోoథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేసిన పిబిసి పరిధిలో ఉన్న 14 మంది లస్కర్లకు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ రెయిన్ కోట్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి డిసి విజయ గోపాల రాజు, కాజులూరు డిసి లాకాని కృష్ణ చైతన్య, సిరిపురం డిసి పేపకాయల నారాయణరావు, ఎర్రపోతవరం డిసి సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి, కొమరిపాలెం డిసి వేణుగోపాల్ రెడ్డి, కాకినాడ డిసి కోప్పిరెడ్డి వీరస్వామి, రామచంద్రపురం డిసి సత్యానంద రెడ్డి, ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్, జేఈ పద్మజ, జేఈ భవాని, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
