Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..

 

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్ అన్నారు.శివాలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఉండ్రుగొండ కు రెండున్నర కోట్లు, సద్దుల చెరువు మిని ట్యాంక్ బండ్ కు 5 కోట్లు, పిల్లలమర్రి కి 3 కోట్లతో అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు కాగా పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీనివాస్ జ్యోతి దంపతులు అర్చకులకు కార్తీక దీపదానాన్ని చేశారు. ఆయన వెంట బండారు సత్యనారాయణ, పద్మ, ప్రవీణ్, వెంకన్న, ఉదయ్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS

*కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బి ఆర్ ఎస్. పార్టీలో చేరిక*

TNR NEWS

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.  ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంట వెయ్యాలి.  వరి, పత్తి, మిర్చి, ఇతర వాణిజ్య పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.  రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి.  పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిపులను వెంటనే విడుదల చేయాలి.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

TNR NEWS

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

TNR NEWS

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs