Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగింది. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి పాఠశాలలో,హాస్టల్లో,గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని అలాగే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మరణించారని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అయితున్న ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని కోరారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే నాణ్యమైన భోజనం అందించకపోయినా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైసమ్మ పెళ్లి రాహుల్,రవితేజ,పుర్మ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ సేవలు అభినందనీయం

TNR NEWS

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS

*చేవెళ్లలో భారాసా దీక్షా దీవాస్*

TNR NEWS