Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగింది. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి పాఠశాలలో,హాస్టల్లో,గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని అలాగే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మరణించారని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అయితున్న ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని కోరారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే నాణ్యమైన భోజనం అందించకపోయినా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైసమ్మ పెళ్లి రాహుల్,రవితేజ,పుర్మ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS