Tnrnews.in
తెలంగాణ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు 

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ శంకర్ రావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి, అబ్దుల్ రఫీదు, సరస్వతి, శ్రీవాణి, కనక లక్ష్మి హెడ్ కానిస్టేబుళ్లు యూనిస్, సుధాకర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ సౌజన్య, పృద్వి, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

Harish Hs

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS