Tnrnews.in
తెలంగాణ

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

మెప్మా విభాగంలో పనిచేస్తున్న మహిళలు పట్టణంలో అట్టడుగునా ఉండే పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మండలా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు, పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, కమిషనర్ రమాదేవి న్యాయవాదులు గట్ల నరసింహారావు, అక్కిరాజు యశ్వంత్,అబ్దుల్ రహీం, ఉయ్యాల నరసయ్య, చలం, బండారు రమేష్ బాబు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలి

Harish Hs

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్

TNR NEWS