February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

మెప్మా విభాగంలో పనిచేస్తున్న మహిళలు పట్టణంలో అట్టడుగునా ఉండే పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మండలా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు, పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, కమిషనర్ రమాదేవి న్యాయవాదులు గట్ల నరసింహారావు, అక్కిరాజు యశ్వంత్,అబ్దుల్ రహీం, ఉయ్యాల నరసయ్య, చలం, బండారు రమేష్ బాబు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…..

Related posts

పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు

TNR NEWS

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి దినపత్రికలు. జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదగా రాజముద్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

TNR NEWS

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

TNR NEWS

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

TNR NEWS

*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*

Harish Hs