Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో నగర ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసుకునే ప్రత్యేక వెసులుబాటు వలన ఇక్కడి ఈద్గా మైదానానికి ఆధ్యాత్మిక గుర్తింపు విశేష చరిత్ర ఏర్పడిందన్నారు. ఈద్గా మైదాన పరిధి విషయంలో వ్యాజ్యం పరిష్కారం చేయని కారణంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారం కల్పించి ఈద్గా మైదానం ప్రగతికి పరిష్కారం చూపాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొణిదెలపవన్ కళ్యాణ్, లా అండ్ జస్టిస్ మైనారిటీ శాఖా మంత్రి నస్యం మహ్మద్ ఫరూక్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, విద్య, ఐటి శాఖామంత్రి లోకేష్ లకు పంపిన వినతి పత్రాల్లో తెలియజేసారు.

Related posts

నిరుపేదలకు గీసాల చారిటబుల్ సొసైటీ నిత్యవసర సరుకులు అందజేత

Dr Suneelkumar Yandra

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

ఘనంగా కుక్కుటేశ్వరుడి రథోత్సవం

Dr Suneelkumar Yandra

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

TNR NEWS