Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో నగర ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసుకునే ప్రత్యేక వెసులుబాటు వలన ఇక్కడి ఈద్గా మైదానానికి ఆధ్యాత్మిక గుర్తింపు విశేష చరిత్ర ఏర్పడిందన్నారు. ఈద్గా మైదాన పరిధి విషయంలో వ్యాజ్యం పరిష్కారం చేయని కారణంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారం కల్పించి ఈద్గా మైదానం ప్రగతికి పరిష్కారం చూపాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొణిదెలపవన్ కళ్యాణ్, లా అండ్ జస్టిస్ మైనారిటీ శాఖా మంత్రి నస్యం మహ్మద్ ఫరూక్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, విద్య, ఐటి శాఖామంత్రి లోకేష్ లకు పంపిన వినతి పత్రాల్లో తెలియజేసారు.

Related posts

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

Dr Suneelkumar Yandra

గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

Dr Suneelkumar Yandra

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

వజ్రకవచధర గోవింద గోవింద

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం

Dr Suneelkumar Yandra