నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా *”మునగాల లో విజ్ఞానోత్సవం”* నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు.
దీనికి సంబంధించిన గోడ పత్రికను *డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం- తెలంగాణ వ్యవస్థాపకులు గోళ్ళమూడి రమేష్ బాబుతో కలిసి* ఆయన సోమవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు.మంగళవారం *గంధం నర్సయ్య విజ్ఞాన ప్రాంగణం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో* నిర్వహించే
ఈ సైన్స్ వేడుకలలో మండలంలోని *ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు* అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని సృజాత్మక శక్తిని వెలికి తీసే విధంగా నిర్వహిస్తున్న *సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలతో పాటు, పర్యావరణ పరిరక్షణ తో గీసిన డ్రాయింగ్స్ ప్రదర్శన మరియు సైన్స్ సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు, విజ్ఞానాత్మక అంశాల డాన్స్ లు* తదితర అంశాల్లో పాల్గొనే విద్యార్థులను వెంట తీసుకొని ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయులు రావాలని ఆయన కోరారు.ఈ వేడుకల్లో పాల్గొన్న *చిన్నారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు కూడా అందిస్తున్నట్టు కన్వీనర్ శ్రీరామ్ శ్రీనివాస్ రావు* తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గోవర్ధన్, జ్యోతి, అంజన్ రెడ్డి, విద్యా భవాని, నాగమణి, సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.