Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

కాకినాడ : మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసం శెట్టి ప్రసన్న కుమార్ (35)కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26 కేజీల బియ్యం, రెండు వేల అయిదువందల నగదు అందజేసి సహకరించింది. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు చేతుల మీదుగా అందించారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) ద్వారా సిఎం సహాయనిధికి ప్రోఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8లక్షల రూపాయల వైద్యాన్ని ప్రయివేటుగా చెల్లించి పొందారని మరో రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వున్నందున సిఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం రూ.10లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్ళే అవకాశం లేనందున వచ్చే వారం గ్రీవెన్స్ కి వెళ్లాలని సూచించారు. జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్న దృష్ట్యా ఇతని కుటుంబ కష్టాలు తెలుసుకుని సిఎం సహాయ నిధి త్వరగా అందించే సహాయం చేయాలన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఇతని కుటుంబానికి పోషణ సహాయం అందించాలని కోరారు. ఎటువంటి పని చేసే శక్తి లేక భార్య ఆసరాతో ఇద్దరు అమ్మాయిలతో ఆవేదన చెందుతున్న అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు, కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు

Dr Suneelkumar Yandra

జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్

Dr Suneelkumar Yandra

మే డే స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు” నామకరణం చేయాలి

Dr Suneelkumar Yandra