Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

కాకినాడ : మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసం శెట్టి ప్రసన్న కుమార్ (35)కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26 కేజీల బియ్యం, రెండు వేల అయిదువందల నగదు అందజేసి సహకరించింది. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు చేతుల మీదుగా అందించారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) ద్వారా సిఎం సహాయనిధికి ప్రోఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8లక్షల రూపాయల వైద్యాన్ని ప్రయివేటుగా చెల్లించి పొందారని మరో రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వున్నందున సిఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం రూ.10లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్ళే అవకాశం లేనందున వచ్చే వారం గ్రీవెన్స్ కి వెళ్లాలని సూచించారు. జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్న దృష్ట్యా ఇతని కుటుంబ కష్టాలు తెలుసుకుని సిఎం సహాయ నిధి త్వరగా అందించే సహాయం చేయాలన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఇతని కుటుంబానికి పోషణ సహాయం అందించాలని కోరారు. ఎటువంటి పని చేసే శక్తి లేక భార్య ఆసరాతో ఇద్దరు అమ్మాయిలతో ఆవేదన చెందుతున్న అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు, కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

Dr Suneelkumar Yandra

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra

నేషనల్‌ హైవే భూనిర్వాసితులకు 50 లక్షలు ఇప్పియ్యాలే – నాడు రూ.25ల పరిహరం ఇవ్వాలని పీఎం లేఖ రాసిన ఎమ్మెల్యే – అధికారంలోకి వచ్చినంక ఆ ఊసే ఎత్తడం లేదు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌. 

TNR NEWS

కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం