Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు” నామకరణం చేయాలి

కమ్యూనిస్ట్ గాంధీకి 113వ జయంతి నివాళి

 

కాకినాడ : చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు) 113వ జయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద సివికెరావు విగ్రహానికి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళావంతుల బిసి సామాజిక వర్గానికి చెందిన సివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ ను మించిన) ఉన్నత విద్య పూర్తి చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని కాకినాడ పురపాలక కౌన్సిలర్ గా, చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ప్రజాహిత ప్రయోజన ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కమ్యూనిస్ట్ గాంధీగా నిస్వార్థ సేవలందించిన దేశభక్తుడని రమణరాజు పేర్కొన్నారు. చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఏకకాలంలో రెండు ఉన్నత పదవులు నిర్వహించిన ఏకైక ప్రజానేతగా ఖ్యాతి చెందారన్నారు. జగన్నాధపురం ఉప్పుటేరు మీద నిర్మించే 3వ వంతెనకు సివికె రావు వారధిగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

దక్షిణమధ్య రైల్వే జిఎంకు పౌరసంక్షేమసంఘం వినతి

Dr Suneelkumar Yandra

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

TNR NEWS

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra