Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కాలంతోపాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని రానున్న రోజుల్లో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదన్నారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు. ఈ సెమినార్ లో కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు……….

 

Related posts

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TNR NEWS