Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కాలంతోపాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని రానున్న రోజుల్లో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదన్నారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు. ఈ సెమినార్ లో కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు……….

 

Related posts

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

TNR NEWS

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి  సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ

TNR NEWS