Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమృత రామానుజరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ అనే అంశంపై ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి శేష ప్రసాద్ అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఉద్దేశించి వాసిరెడ్డి అమర్ నాధ్ మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భయం అవసరం లేదన్నారు. కాలంతోపాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని రానున్న రోజుల్లో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదన్నారు. సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు. ఈ సెమినార్ లో కళాశాల డైరెక్టర్ నాగార్జున, ప్రిన్సిపల్ గాంధీ, కోమరగిరి రంగారావు, ట్రస్ట్ సభ్యులు కొండపల్లి శారద ప్రసాద్, కొండపల్లి శ్రీ వాత్సవ్, కొండపల్లి శ్రీకర్, న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు……….

 

Related posts

*ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి : DSP జి.రవి.*  *సూర్యాపేట కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణను ఆకస్మికంగా తనిఖీచేసిన DSP రవి.*

TNR NEWS

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

TNR NEWS

మహిళలపై దాడులను ఆపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి

TNR NEWS

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs

నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని

TNR NEWS

TG : తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

TNR NEWS