Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని శనివారం కోదాడ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొన్న కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.ఈ “విద్యార్థుల అభినందన సభ,,కి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ అధ్యక్షత వహించారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ ఆధ్వర్యంలో గత ఎస్ఎస్సి పరీక్షలలో జిల్లా ప్రధమ ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీ సీట్లు పొందిన తాళ్లూరి రేఖ శ్రీ కి 5000 రూపాయలు అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు 5000 రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయలను వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. జిల్లాస్థాయి ర్యాంకు ,ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించటం కోసం కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని సంఘ నాయకులు అభినందించారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని సంఘ నాయకులు తెలిపారు. ఈ “అభినందన సభ,, కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు, ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, రెడ్లకుంట మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరు హనుమంతరావు, రావెళ్ళ కృష్ణారావు, వేమూరు విద్యాసాగర్, లైటింగ్ ప్రసాద్ వేమూరు రామయ్య ఉపాధ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 

TNR NEWS

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

సిపిఎం లో 15 కుటుంబాలు చేరిక

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

అనసూర్యమ్మ మరణం బాధాకరం… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS