May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని శనివారం కోదాడ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొన్న కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.ఈ “విద్యార్థుల అభినందన సభ,,కి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ అధ్యక్షత వహించారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ ఆధ్వర్యంలో గత ఎస్ఎస్సి పరీక్షలలో జిల్లా ప్రధమ ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీ సీట్లు పొందిన తాళ్లూరి రేఖ శ్రీ కి 5000 రూపాయలు అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు 5000 రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయలను వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. జిల్లాస్థాయి ర్యాంకు ,ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించటం కోసం కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని సంఘ నాయకులు అభినందించారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని సంఘ నాయకులు తెలిపారు. ఈ “అభినందన సభ,, కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు, ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, రెడ్లకుంట మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరు హనుమంతరావు, రావెళ్ళ కృష్ణారావు, వేమూరు విద్యాసాగర్, లైటింగ్ ప్రసాద్ వేమూరు రామయ్య ఉపాధ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

Harish Hs

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS

జిల్లా పోలీస్ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

ముగిసిన గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు

Harish Hs

నేడు సాయిబాబా శతజయంతి వేడుకలు

TNR NEWS