Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని శనివారం కోదాడ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభలో పాల్గొన్న కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.ఈ “విద్యార్థుల అభినందన సభ,,కి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు సలీం షరీఫ్ అధ్యక్షత వహించారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ ఆధ్వర్యంలో గత ఎస్ఎస్సి పరీక్షలలో జిల్లా ప్రధమ ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీ సీట్లు పొందిన తాళ్లూరి రేఖ శ్రీ కి 5000 రూపాయలు అలాగే త్రిబుల్ ఐటీ సీటు సాధించిన నరేంద్రకు 5000 రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయలను వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. జిల్లాస్థాయి ర్యాంకు ,ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించటం కోసం కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని సంఘ నాయకులు అభినందించారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని సంఘ నాయకులు తెలిపారు. ఈ “అభినందన సభ,, కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు, ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, రెడ్లకుంట మాజీ సర్పంచ్ సాదినేని అప్పారావు, మల్లెల పుల్లయ్య, సాతులూరు హనుమంతరావు, రావెళ్ళ కృష్ణారావు, వేమూరు విద్యాసాగర్, లైటింగ్ ప్రసాద్ వేమూరు రామయ్య ఉపాధ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు

TNR NEWS

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS