Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు

ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ పద్మనాభ రెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సోమవారం ఆయన 12వ వర్ధంతి సందర్భంగా కోదాడ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం హైకోర్టులో నిరంతరం న్యాయపోరాటం సాగించి బాధితులకు అండగా నిలిచిన మహనీయుడు పద్మనాభ రెడ్డి అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తన గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గట్ల నరసింహారావు, కోదాడ అధ్యక్షులు అబ్దుల్ రహీం, కార్యదర్శి వెంకటాచలం, సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి, శరత్ బాబు, యశ్వంత్, సిలివేరు వెంకటేశ్వర్లు, ఉయ్యాల నరసయ్య, హేమలత, మురళి, శ్రీధర్,వెంకన్న, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు……

 

Related posts

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

Harish Hs

ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత..

TNR NEWS

కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్..

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs