తల్లి శ్రమ, ప్రోత్సాహంతోనే పీహెచ్ డీ సాధించినట్లు కోదాడ పట్టణానికి చెందిన గోపికృష్ణ అన్నారు. భౌతిక శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గోపికృష్ణ చిన్నతనంలోనే తండ్రి దూరమైన, ఆయన తల్లి రాజ్యలక్ష్మి ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత విద్యలు చదివించింది. తన విజయం వెనుక అమ్మ త్యాగం మరువలేనిదని గోపికృష్ణ పేర్కొన్నారు.