Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రైతులు అందోళన చెందవద్దు – మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు : యూరియా దొరకదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ రైతులకు తెలిపారు. గొల్లప్రోలు సొసైటీ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో వర్మ రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు 2 బస్తాలు చొప్పున అందజేసారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు షాపులలో ఎరువులు బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించే వారని, కూటమి ప్రభుత్వంలో రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా అసలు ధరకే యూరియా అందజేస్తున్నామని తెలిపారు. రైతులు అందరికీ యూరియా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా ఇప్పటివరకు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయకపోవడం పై సొసైటీ కార్యదర్శి ఆదిరెడ్డి సూరిబాబు పై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా వచ్చిన వెంటనే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వ్యవసాయ శాఖ ఎడి స్వాతి, మండల వ్యవసాయాధికారి కె.వి.వి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సిబ్బంది అపర్ణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి

Dr Suneelkumar Yandra

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

రంగుల ప్రపంచం – సాధారణ మానవుని జీవితం చిద్రం

Dr Suneelkumar Yandra

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం : డా అడ్డాల

Dr Suneelkumar Yandra

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ