Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

  • జనసేనని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన జన శ్రేణులు

 

  • జన సైనికులు తలుచుకుంటే క్షణాల్లో గ్రౌండ్ శుభ్రపరుస్తాం – చిల్లపల్లి శ్రీనివాసరావు

పిఠాపురం : పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభా ప్రాంగణాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎపిఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆయన అనుచరులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చామని, జనసైనికులు తలుచుకుంటే కొద్ది గంటల్లోనే సభ ప్రాంగణాన్ని మొత్తం క్లీన్ చేస్తారని, అందరూ పాల్గొని జనసైనికుల పవర్ అంటే ఏంటో తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ రామ్మోహన్ రావు, ఏపి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసుధానరావు, మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంటీఎంసి కార్యదర్శి షేక్ వజీర్ భాష, జనసేన పార్టీ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, జొన్న రాజేష్, తిరుమలశెట్టి గోపీనాథ్, చిల్లపల్లి యూత్ అధ్యక్షుడు మేకల సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైయస్సార్ పార్టీకి బాలిపల్లి రాంబాబు రాజీనామా

విజయవంతంగా ముగిసిన పిఠాపురం మండల గ్రామముల ఆవిర్భావ సభ సన్నాహక సమావేశములు

Dr Suneelkumar Yandra

అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్

TNR NEWS

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు