Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మలిచింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ నందు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.దేశానికి స్వాతంత్ర్యం అనంతరం తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా సమైక్య భారతావానికి ఎనలేని కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. విద్యార్థులు వారి ఆశయాల సాధనకై కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాకీర్ కార్యదర్శి అబ్దుల్ గఫార్,ఖాజా మియా, ఖన్నం సాహెబ్,జబ్బార్, ముక్తార్, శ్రీనివాస్ రెడ్డి,బడుగుల సైదులు, పాండురంగ చారి,బ్రహ్మచారి,దేవరాజ్, బ్రహ్మానందం,రామకృష్ణ, రవి, జానకి తదితరులు పాల్గొన్నారు………..

Related posts

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

TNR NEWS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

TNR NEWS

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

కోదాడ ప్రజలకు విజ్ఞప్తి / న్యూసెన్స్ చేసేవారికి పోలీస్ వారి హెచ్చరిక నూతన సంవత్సర వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు  కోదాడ డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి

TNR NEWS