Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌     హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు

 

గత కోన్ని రోజులుగా బస్టాప్‌ లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, రాంసానిపల్లి చౌరస్తా వద్ద బస్టాప్‌ ను ఏర్పాటు చేయాలంటూ ఐదు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నారాయణఖేడ్‌ డిపో మేనేజర్‌ను కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌కు అనుమతినిచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రయాణీకులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు సోమవారం రాంసానిపల్లి వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్‌ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక నుంచి అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఇక్కడ అగుతాయని ఆర్టీసీ అధికారులు గ్రామ నాయకులకు హమీ ఇచ్చారు. చౌరస్తా వద్ద బస్టాప్‌ ఏర్పాటుతో రాంసానిపల్లి, ఎర్రారం, నేరడిగుంట, రాంసాని పల్లి తండా, కిచ్చన్నపల్లి గ్రామాలకు చెందిన ప్రయాణికులకు ఎంత గానో లబ్ధి చేకూరుతుందని ఆయా గ్రామాల నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ బస్సులు అపకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. నారాయణ ఖేడ్‌ డిపో మేనేజర్‌ మల్లేశం చొరవతో బస్టాప్‌ ఏర్పాటు అయ్యిందని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

Harish Hs

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS