Tnrnews.in
తెలంగాణ

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేష్ బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేసిన విధానాన్ని గురించి మంత్రి కి వివరించారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో ఏఎంసీ లను ఎంపిక చేశామని తెలిపారు.స్థానిక మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమక్షంలో ఆశావాహులందరిని విడి విడిగా కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశామని.ఎవరైతే సరైన సమాధానాలు చెప్పి ఎక్కువ మార్కులు సాధించారో వారినే చైర్మన్ లు గా ఎంపిక చేశామని మంత్రి గారికి వివరించారు.జుక్కల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు.నూతన విధానంలో ఏఎంసీ చైర్మన్ ల ఎంపిక చేపట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో రామ్ పటేల్ మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్లు స్వామి సాయి పటేల్ ఎం. బస్వంత్ రావు వాట్నాల్వార్ రమేష్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అనాధ ఆశ్రమంలోఅన్నదానం….  మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు..

TNR NEWS

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs

షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధం

TNR NEWS

బొంత శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పాలకుల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS