Tnrnews.in
తెలంగాణ

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

: తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల మేధస్సును గుర్తించడం జరిగిందని తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షులు షకీల్ పాష అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రతిభా పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందజేయడం జరిగిందన్నారు. మండల స్థాయి ఇంగ్లీష్ మీడియంలో ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుప్రియాల్ ఈ.అనూష, ద్వితీయ స్థానం జి. క్రిష్ణేశ్వరి,తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారస్ పూర్ షేక్ రహ్మేత్ ఉన్నిస.తెలుగు మీడియంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఏ. ఆకాంక్ష, ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఈ. చందన తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర దౌల్తాబాద్ ఏ. రామ్ చరణ్ విద్యార్థులు గెలుపొందారు. వీరు డిసెంబర్ 11న సిద్దిపేట జిల్లా కొడకండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్, ఉపాధ్యాయులు నర్సింలు, సుధాకర్, రాజయ్య, జంపన్న, మహిపాల్, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైబర్ నేరాల పై అవగాహన

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

పేదలకు అండగా ప్రభుత్వం:జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

రైతు. కార్మిక హక్కుల పరిరక్షణకై నవంబర్ 26న జరిగేమోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయండి.

TNR NEWS

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs