వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 120
ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డిఓ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.