Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బా కోట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ వద్ద చిరు వ్యాపారులతో పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ షేక్ షమీతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు.బడా బాబులు ఆక్రమించుకుంటే పట్టించుకోని వారు జీవనోపాధి కొరకు చిన్న చిన్న డబ్బి కోట్లు వేసుకున్న వారిని వేధించడం సరైనది కాదన్నారు.సమస్యను మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకువెళ్లి చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు.ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ షేక్ షమీ, మజాహర్,జానీ మియా, వెన్నెల శ్రీను, రామకృష్ణ,ఖలీల్, షేక్ జానీ, గంధం రామకృష్ణ, మహమూద్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు…….

Related posts

నేటికలెక్టరేట్ ముట్టడికి రైతాంగం తరలి రావాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

TNR NEWS

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

ఆశా”ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి  సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన

TNR NEWS

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS