కోదాడలో సిటి ఆప్టికల్స్ మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ ను శుక్రవారం డాక్టర్ జాస్తి సుబ్బారావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
కోదాడ ప్రాంత ప్రజలకు
రేబాన్,క్రిజాల్,ఓటు, ఫాస్ట్రాక్ తదితర అంతర్జాతీయ కళ్ల జోళ్ళ బ్రాండ్ లు అందుబాటులో తెచ్చినందుకు అభినందనలు తెలిపారు. హుజూర్ నగర్ రోడ్డు లో తమ సొంత భవనంలోని కె.కె.ప్లాజాలో షేక్ కరీం & ఖాసీం బ్రదర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటి ఆప్టికల్స్ మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ లో అన్ని రకాల కళ్ళ జోళ్ళను అతి తక్కువ ధరలకు అందించే ఉద్దేశంతో సిటీ ఆప్టికల్స్ ను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు.
ఇటువంటి అవకాశాన్ని కోదాడ పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సిటీ ఆప్టికల్స్ వారు వ్యాపార రంగంలో మంచిగా రాణించాలని,
దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,
సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్,
లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి,
కోదాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,వీరారెడ్డి, బైరు భాస్కర్ గౌడ్,
ఉట్కూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post