Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

  • “జనాభా లెక్కలు – డీ లిమిటేషన్ -ఎన్నికల సంస్కరణలు” అంశంపై సదస్సు నిర్వహించి

 

  • రాష్ట్రపతికి పౌరవినతి పత్రం అందిస్తాం – పౌర సంక్షేమ సంఘం

 

కాకినాడ : జనాభా ప్రాతిపదిక గా పార్లమెంట్ సీట్ల సంఖ్య కేటాయింపులో దక్షిణాదికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. 1970వ దశకంలో నూరు శాతం కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాదికి ఒకే రకమైన నిష్పత్తి కేటాయిస్తే ఉత్తరాదికి ఎక్కువ దక్షిణాదికి తక్కువ సీట్లు ఏర్పడ తాయన్నారు. దక్షిణాదికి ఇప్పుడున్న సీట్ల సంఖ్య తగ్గకుండా చేసినా ఉత్తరాది సీట్లు పెరుగుతాయన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి ప్రభుత్వ పథకాలు విద్య ఉద్యోగ రాజకీయ ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు అదే దిశగా దక్షిణాదికి ప్రత్యేక నిష్పత్తి కేటాయింపు ద్వారా పార్లమెంట్ సీట్లు దక్కాల్సిన అవసరం వుందన్నారు. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా డీ లిమిటేషన్ నిర్వహణ లో వారి అజెండా ఏరకంగా వున్నప్పటికీ జనాభా నియంత్రణ పాటించిన తెలుగు రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు దక్కాల్సిన వాటా రాకుంటే తిరుగుబాటు తప్పదన్నారు. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు తెలుగు రాష్ట్రాలకు తగ్గిపోవడం వలన ఉత్తరాది రాష్ట్రా లతో పోలిస్తే 3నుండి 5శాతం వెనుకబడిన దుస్థితి దాపురించింద న్నారు. జనాభా లెక్కల సేకరణ జరగక పోవడం వలన పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు కాకపోవడం వలన పరిపాలనలో పారదర్శకత కరువైన పరిస్థితి వచ్చిందన్నారు.  మేధావులు, ప్రజా స్వామికవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పౌరసంఘం ఆధ్వర్యాన జనాభా లెక్కలు – డీ లిమిటేషన్ నిర్వహణ – ఎన్నికల సంస్కరణలు అంశంపై సదస్సు ఏర్పాటు చేసి న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వయంగా ప్రజాభిప్రాయ వినతి అందిస్తామని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో పాత్రికేయులకు తెలియజేసారు.

Related posts

డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి

Dr Suneelkumar Yandra

ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే పెండెం

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

ఘనంగా కృష్ణాజిల్లా జంప్ రోప్ జట్ల ఎంపికలు 

TNR NEWS

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra