Tnrnews.in
తెలంగాణ

బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. _ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు.

బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్  తెలిపారు. నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికాళాంగురాలు భూమా రమాదేవి భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు అని డయల్ 100 కు ఫోన్ చేయగా సంచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి FIR కాపీని బాదితురాలికి అందించారు అని తెలిపినారు. *FIR ఎట్ డోర్ స్టెప్* కార్యక్రమం ద్వారా మహిళలపై, పిల్లలపై, వృద్దులపై దాడులు, దొంగతనాల, భౌతిక దాడులు, బాల్య వివాహాలు, వేదింపులు వట్టి సందర్భాల్లో బాధితులకు భరోసాగా ఉంటుంది, ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపినారు. మొదటి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ  అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడేవి ఆటపాటలు

TNR NEWS

భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి

TNR NEWS

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS