Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అవినీతి బి ఆర్ ఎస్ ను భూస్థాపితం చేస్తాం… – మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

 

టిఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే అందరమెక్కి 10 సంవత్సరాల పాటు పందికొక్కుల దోచుకున్నారని మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు.శనివారం ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేని టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మీ అవినీతి అక్రమాలకు గుట్టు రట్టు చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అభివృద్ధి కంటే దోపిడీ ఎక్కువ జరిగిందని. ప్రజలపై దాడులు దౌర్జన్యాలు చేస్తూ భయభ్రాంతులను గురిచేసి దోచుకున్నది మీరు కాదని ప్రశ్నించారు. మీ అవినీతి అక్రమాలను చూసిన తెలంగాణ ప్రజలు చీదరించుకొని ఛీ కొట్టిన కూడా బుద్ధి రావడం లేదన్నారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. సన్న చిన్న కారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట రుణాలను మాఫీ చేసి వారి గుండెల్లో చిరిగిన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్కా సుమలత మాజీ జెడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, పరకాల నియోజకవర్గం అసెంబ్లీ యూత్ కమిటీ ఉపాధ్యక్షులు మాదాసి శ్రీధర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుత రాజేందర్ మానగాని సాంబమూర్తి అలకంటి రణవీర్ ఎగితే లింగయ్య, గుండెబోయిన శ్యామ్, తనువుల సందీప్, పొనుగోటి సత్యనారాయణ,నాగరాజు తదితరులుపాల్గొన్నారు

Related posts

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS

గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి  ప్రిన్సిపాల్ కనిక వర్మ

TNR NEWS

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

TNR NEWS

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

Harish Hs

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS