Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

కాకినాడ : జ్యోతిర్లింగాలు దైవిక శక్తికి మూలాధారాలని మహాశివరాత్రి రోజున దీపజ్యోతులతో ఆరాధన చేయడం మహాదేవుని వైభవంగా ఆచరించే సంప్రదాయమని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షు డు, సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టిసి కాంప్లెక్స్ రైతు బజార్ వెనుక వున్న బర్మా కాందిశీకుల కాలనీలో గణపతి మందిరం వద్ద ఆలయ పునఃనిర్మాణ కమిటీ మహా శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించింది. కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న రమణరాజు కలశ పూజ నిర్వహించి శివతత్వ మహిమ, శైవపురాణ విశేషాలను తెలియజేసారు. కోలా ఎల్లారావు పర్యవేక్షణలో స్థానిక గృహిణులు పాల్గొని దీపాలు వెలిగించి హరహర మహాదేవ నామస్మరణ చేసారు. కోలాఎల్లా రావు దంపతులు వెంకటలక్ష్మి, సుగ్గుకృష్ణ, ఇళ్ల బాపూజీ, సత్యనారాయణ, కన్నీడి వరప్రసాద్, బీర చిన్నరాజు పాల్గొన్నారు.

Related posts

అలరించిన శ్రీ కృష్ణుడి లీలలు – అభినందించిన డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక

Dr Suneelkumar Yandra

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Dr Suneelkumar Yandra

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

TNR NEWS