Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

  • కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 

 

యు.కొత్తపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) మరియు జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తుఫాను ప్రభావం ఏర్పడిన పంట పొలాల్లో పర్యటించారు. తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తక్షణమే పంట నష్ట జాబితా సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు, సినీ నటుడు డా. బి.ఎన్.రాజు, నాయకులు డా. జ్యోతుల శ్రీనివాస్, ఓదూరి నాగేశ్వరరావు, జనసేన కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో అడ్డగోలు దోపిడి

Dr Suneelkumar Yandra

బహిరంగ మద్యపాన నిషేధం అమలు చేయాలి

Dr Suneelkumar Yandra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

TNR NEWS

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Dr Suneelkumar Yandra