Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని అంతర్జాతీయ ఐపిఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్ లో గల మైదానంలో కోదాడ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. కోదాడలో క్రికెట్ తో పాటు క్రీడల అభివృద్ధికి లాజర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని యువత చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలకు ట్రోఫీ లతోపాటు చెక్కులను అందజేశారు. వారం రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 30 జట్టులో పాల్గొనగా ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట టీం, ద్వితీయ స్థానం కోదాడ బైపాస్ 11 టీం, తృతీయ స్థానం కోదాడ టీం, నాలుగో స్థానంలో కోదాడ టీచర్స్ టీం లు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వహకులు లాజర్, సన ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ నవమన్, పంది తిరపయ్య, షేక్ అలీమ్, రాజేష్, నాగప్రసాద్, అభి మస్తాన్, సైదయ్య తదితరులు పాల్గొన్నారు….

Related posts

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Harish Hs

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో …. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ  – గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS