Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి తీరని లోటని, ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జె. సుదర్శనం అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బిషప్ డాక్టర్ జె. సుదర్శనం మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గాని ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది మతఛాందసవాదులు చేసిన కుట్రలో భాగమేనని ఆయన దుయబట్టారు. పగడాల ప్రవీణ్ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ప్రవీణ్ హత్యకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మరల పునరావృతం కాకుండా రాష్ట్రంలో క్రైస్తవ మందిరాలకు, క్రైస్తవ పాస్టర్లకు తగు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రైస్తవ మీడియా కన్వీనర్ జె జె శామ్యూల్ సన్, మునగాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు ఆదాము, సామ్యూల్ పీటర్, మండల సామాజిక కార్యకర్త గంధం సైదులు, కోదాడ టాన్ అధ్యక్షులు పి. పాల్ చారి, మోతే మండల అధ్యక్షులు ఎల్. లాజర్, పాస్టర్లు డేవిడ్ రాజు, జె. లుకా, వసంత్, ఓబద్య, ఎం. రాజేష్, జె. సమూయేలు, అబ్రాహాము రాజు, రక్షకన్, విలియమ్స్, ఇ. ఉదయ్, క్రైస్తవులు, యూత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి    సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

TNR NEWS

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs

కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

TNR NEWS

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TNR NEWS

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య…… కోదాడ ముస్లిం మైనార్టీ పాఠశాలకి దోమ తెర డోర్లు,ఐ ఐ టి, నీట్ ప్రవేశ పరీక్షలకొరకు బుక్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాస్ ల కొరకు ప్రొజెక్టర్ ఏర్పాటు….. విద్య ద్వారానే సమాజం లో గుర్తింపు…… మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం….. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…… రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

TNR NEWS