Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి    సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో కేద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి అన్నారు. సీపీఎం మద్దూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరై మాట్లాడుతూ నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా పుస్కాలంగా వర్షాలు కురువడంతో రైతులు విస్తృతంగా వరి సాగు చేశారు.కానీ సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ఫర్టిలైజర్ ల చుట్టూ రాత్రనక పగలనక లైన్ల లో నిల్చున్నప్పటికి దొరకడం లేదని అన్నారు. కేద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుంగాన్ని కూడగట్టి ఉద్యమిస్తామని అన్నారు.అనంతరం మద్దూరు ఏరియా కమిటీని ఎన్నుకున్నారు.

*సీపీఎం మద్దూరు ఏరియా కార్యదర్శిగా గోపాల్ ఎన్నిక*

మద్దూరు మండల కేంద్రం లో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం లో మద్దూరు కోస్గి దామరగిద్ద మండల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాల్ ఏరియా కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా మరో పదిమంది కమిటీ సభ్యులు గా ఎన్నికయ్యారు.కార్యక్రమం లో అశోక్,అంజిలయ్య గౌడ్,అలీ,జోషి, శివకుమార్,హన్మంతు,రామక్రిష్ణ, లాలప్ప, అరుణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

TNR NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS