Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం వాసికి సివిల్స్లో 94వ ర్యాంకు

పిఠాపురం : ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీస్‌ రిజల్ట్స్‌ ప్రభుత్వం మంగళవారం వెలువరించింది. ఇందులో పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్‌ 94వ ర్యాంకు సాధించాడు. చక్కా స్నేహిత్‌ ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీస్‌లో 94వ ర్యాంకు సాధించడంపట్ల తండ్రి చక్కా వెంకట్‌ (చిన్నా), తల్లి మాటూరి కోముదిని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5వ తరగతి వరకు పట్టణంలో ఉన్న ఆదర్ష్‌ హైస్కూల్‌లో చదివి, గుంటూరు భాష్యంలో 10వ తరగతి, ఇంటర్‌ పూర్తి చేశాడు. అనంతరం ఎంసెట్‌లో 31వ ర్యాంకు సాధించాడు. సివిల్స్‌లో ఆల్‌ ఇండియాలో 94వ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, మిత్రులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా చక్కా స్నేహిత్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ సర్వీస్‌ చేయాలనే ధృడసంకల్పంతో కష్టపడి ర్యాంకు సాధించానని తెలిపారు. ఇందుకు తనకు పూర్తి సహకారం అందించిన తల్లిదండ్రులు చక్కా వెంకట్‌ (చిన్నా), తల్లి గుంటూరు జిల్లా జడ్జి మాటూరి కోముదినిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

బహిరంగ మద్యపాన నిషేధం అమలు చేయాలి

Dr Suneelkumar Yandra

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

Dr Suneelkumar Yandra

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra

ఉపాధి పనులు పరిశీలించిన పాడా పీడీ

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభ వేదిక నిర్మాణానికి భూమి పూజ