కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లా ” షీ టీమ్” ఆధ్వర్యంలో కోదాడ విభాగం వారు విద్యార్థులకు చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా… “కోదాడ షీ టీం హెడ్ కానిస్టేబుల్ యం. కవిత ” పాల్గొని ఆమె మాట్లాడుతూ సమాజంలోని అమ్మాయిలు, మహిళలు సురక్షితంగా ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. అమ్మాయిలను, విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించడంజరుగుతుందని, ఈవ్ టీజింగ్ లకు పాల్పడే ఆకుతాయిల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇస్తామని, అయినప్పటికీ నేరం చేసి పట్టుబడితే నిర్భయ కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. షీ టీం బృందం నిఘా సూక్ష్మ కెమెరాలతో, సాధారణ దుస్తులతో జనంలో కలిసిపోయి ఆకతాయిలను, వేధింపులకు గురి చేసే వారిని గుర్తిస్తున్నామని అందుకే ఇలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టీం ప్రతి ఒక్కరికి ఈ నేరాలపై అవగాహన ఉండేలా సదస్సులు, కౌన్సిలింగులు చేస్తున్నామని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ ఆర్ .పిచ్చిరెడ్డి, షీ టీం బృందం కానిస్టేబుల్ కె.సాయి జ్యోతి, కానిస్టేబుల్ జి. నాగేంద్రబాబులతో పాటుగా అధ్యాపకులు జి. యాదగిరి, వి. బల భీమారావు, ఆర్. రమేష్, పి .రాజేష్, ఎం. రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి .వెంకన్న, కె. రామరాజు, జి. రవి కిరణ్, జి .నాగరాజు, ఎస్. గోపికృష్ణ, ఎస్కే. ముస్తఫా, ఈ. నరసింహారెడ్డి, ఎస్. కే. ఆరిఫ్, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్ .చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వర చారి, టీ.మమత, డి.ఎస్. రావు విద్యార్థులు పాల్గొన్నారు