Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మోతె:బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయిని,దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయంకోరేశక్తులు,ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దమైన చర్యలన్నీ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపించినాఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని గుర్తు చేశారు. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ తీయలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో బిజేపి ఉండడం వల్లనే ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యం అవుతుందన్నారు.

Related posts

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య…… కోదాడ ముస్లిం మైనార్టీ పాఠశాలకి దోమ తెర డోర్లు,ఐ ఐ టి, నీట్ ప్రవేశ పరీక్షలకొరకు బుక్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాస్ ల కొరకు ప్రొజెక్టర్ ఏర్పాటు….. విద్య ద్వారానే సమాజం లో గుర్తింపు…… మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం….. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…… రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

TNR NEWS

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

షిరిడి నగర్ కాలనీ వాగు లో గుర్రపు డెక్కను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఎర్నేని

TNR NEWS