Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో వృక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిలోని చరాచర జీవులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విజయీ భవ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు చారుగాండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్, గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు………

Related posts

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

TNR NEWS

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

TNR NEWS

బాల్య వివాహలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

TNR NEWS