Tnrnews.in
తెలంగాణ

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో వృక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిలోని చరాచర జీవులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విజయీ భవ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు చారుగాండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్, గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

స్కూల్ పాఠ్యాంశంలో లైంగిక విద్యను చేరుస్తాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

TNR NEWS

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు…

TNR NEWS

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

TNR NEWS

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నవంబర్7,8 తేదీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగే సర్వేలను* *జయప్రదం చేయండి.*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు* 

TNR NEWS