Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో వృక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిలోని చరాచర జీవులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విజయీ భవ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు చారుగాండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్, గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు………

Related posts

డిజేఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

TNR NEWS

సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం

Harish Hs

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS