టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు బృందం చే భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య కనుల పండువగ నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు జరిపి తీరొక్క పూలతో అలంకరించి పుష్పాభిషేకం కార్యక్రమాన్ని కనుల పండువగ నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని జరిపారు. జైశ్రీరామ్ నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. భక్తులు స్వామివారి వద్ద అన్న ప్రసాదాన్ని స్వీకరించారు…………..
Save or share this story as a newspaper-style Epaper Clip:
