Tnrnews.in
తెలంగాణ

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ‌కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని రైతు ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకువచ్చిన ధాన్యం రాశికి నిప్పు అంటించి తగలబెట్టాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

Harish Hs

చంద్రగ్రహణం కారణంగా గణేష్ ఉత్సవాలు తొమ్మిది రోజులే జరపాలి

Harish Hs

జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

Harish Hs