పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళలను కారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఉదయ నగర్ కు చెందిన నలుగురు మహిళలు పట్టణ శివారుని ఓ ఫంక్షన్ హాల్ లో పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా పెద్దపల్లి ఆదర్శనగర్ వద్ద కరీంనగర్ నుండి గోదావరిఖని వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నలుగురు మహిళలను వెనకవైపు నుంచి ఢీకొట్టడంతో అమృత భాగ్య అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పద్మ అనే మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో మహిళ స్వల్ప గాయాలతో నుండి బయటపడింది. అతివేగంగా మహిళలను ఢీ కొట్టిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అక్కడ నుంచి పారిపోయిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకొని కారును గుర్తించే పనిలో పడ్డారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
