Tnrnews.in
తెలంగాణ

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

 

కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ, తదితర అధికారులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు. దాడిని నిరసిస్తూ..మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బ్లాక్ రిబ్బన్ ధరించి సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలని, దాడుల వల్ల కేసులు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం కన్న ప్రజలు చెప్పదలచుకున్నది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న అధికారులకు చెప్పాలని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఢిల్లీలో కీలక సమావేశం.. తెలంగాణ తరఫున మంత్రి సీతక్క హాజరు

TNR NEWS

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్& ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Harish Hs

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS