Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

 

భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి 75 సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేదని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి, నలగామ శ్రీనివాస్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బిజెపి కార్యాలయంలో బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బిజెపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దారం గురువారెడ్డి నలగామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనాల రూపకల్పన మాత్రమే కాదని కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిభింభము డా. బి ఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి, కుడిక్యాల రాములు, వేదాంతం వెంకటరమణ, దేవులపల్లి మనోహర్ యాదవ్, సంపత్ రెడ్డి, రమణ ,నరసింహ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు

TNR NEWS

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TNR NEWS

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs