శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో చేవెళ్ల మండల పరిధిలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు శివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో పిండి, నేతి దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందేలా 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని అంతారం గ్రామ పరిధిలో ఉన్న అమృత పంచాలింగేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల మహిళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
