Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రభుత్వ పాఠశాలకు ఆర్ధిక సహాయం అందజేత* 

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన పసునూటి స్వాతి -కళ్యాణ్ ఎన్నారై సైంటిస్ట్ దంపతులు, సైంటిస్ట్ స్వాతి పుట్టినరోజు సందర్భంగా, తమ ఆత్మీయ మిత్రుడు కర్ణకంటి రాంమూర్తి హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న నల్లబెల్లి మండలం, నాగరాజుపల్లి గ్రామంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తమై రూ10,000/-ల ఆర్ధిక విరాళం పంపించారు.

ఈసందర్భంగా పంతులుపల్లి పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి మాట్లాడుతూ.. పసునూటి స్వాతి -కళ్యాణ్ ఎన్నారై సైంటిస్ట్ దంపతులు, వృత్తి రీత్యా అమెరికా లో ఉన్నప్పటికీ, వారి మనసంతా మాతృ దేశం కోసం ఏమైనా చేయాలని ఉంటుందని, గతంలో కూడా వారు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారనీ, కరోనా సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి శానిటైజర్స్ ఉచితం గా పంపిణీ చేశారని, వివిధ క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు కూడా ఆర్ధిక సహకారం అందజేశారనీ, ప్రస్తుతం మారుమూల ప్రాంతం లోని తమ పాఠశాల అభివృద్ధికి కూడా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు కునమళ్ల రాజన్ బాబు గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Harish Hs

తాగునీటి కోసం తప్పని తిప్పలు  తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

TNR NEWS