Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా కోదాడ మిత్రమండలి సభ్యులంతా కలిసి వారి దంపతులకు శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ముత్తినేని సైదయ్య నిబద్ధత, అంకితభావంతో పని చేశారని వారి సేవలను కొనియాడారు. పదోన్నతి లభించడం విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని ఇటువంటి పదోన్నతులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు, ఎస్ ఆర్ కే మూర్తి, ముత్తవరపు పాండురంగారావు, పైడిమర్రి సత్తిబాబు, పట్టాభి రెడ్డి, పోటు రంగారావు, యలమందల నరసయ్య, నాగేశ్వరరావు, పాశం నాగిరెడ్డి, కరుణాకర్, శ్రీనివాసరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

TNR NEWS