Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా కోదాడ మిత్రమండలి సభ్యులంతా కలిసి వారి దంపతులకు శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ముత్తినేని సైదయ్య నిబద్ధత, అంకితభావంతో పని చేశారని వారి సేవలను కొనియాడారు. పదోన్నతి లభించడం విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని ఇటువంటి పదోన్నతులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు, ఎస్ ఆర్ కే మూర్తి, ముత్తవరపు పాండురంగారావు, పైడిమర్రి సత్తిబాబు, పట్టాభి రెడ్డి, పోటు రంగారావు, యలమందల నరసయ్య, నాగేశ్వరరావు, పాశం నాగిరెడ్డి, కరుణాకర్, శ్రీనివాసరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన వారి గురించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు  – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ 

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ తీర్ధం పూచ్చుకున్న అంజన్ గౌడ్..

Harish Hs

కెఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ పోస్టుకు దరఖాస్తులకు ఆహ్వానం

Harish Hs

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు

TNR NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

TNR NEWS