Tnrnews.in
తెలంగాణ

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు.  గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనవరి నెలలో జరుపుకునే  విశ్రాంత ఉద్యోగుల  పుట్టినరోజు వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కోదాడ సంఘం వారు చేసే కార్యక్రమాలను చూసి రాష్ట్రవ్యాప్తంగా ఇతర పెన్షనర్లు అనుసరిస్తున్నారని ఇది తమ సంఘానికి ఎంతో గర్వకారణం అన్నారు. పెన్షనర్లు తప్పనిసరిగా కార్యాలయంలో జరిగే వేడుకలకు హాజరు కావాలన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శాలువా, మెమొంటో తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, అమృత రెడ్డి,రఘువర ప్రసాద్, విద్యాసాగర్, ,పొట్ట జగన్మోహన్ రావు,భ్రమరాంబ,శోభ, గడ్డం. నరసయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు……………………..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లను (సుమారు 25,68.997లక్షల విలువగల) బాధితులకు అందజేత.

TNR NEWS

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

TNR NEWS

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై గోపాల్ రెడ్డి

TNR NEWS

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS