Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దామని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర కీలకమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. సత్యం, అహింస, ధర్మం అనే మార్గంలోనే చివరివరకు నడిచారని అన్నారు. నేటి యువత వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, సుందరి వెంకటేశ్వర్లు, డేగ శ్రీధర్, షమ్మీ,బాగ్దాద్, భాజాన్, ధావల్, గుండె పంగు రమేష్,ముస్తఫా, బాబా,సైదిబాబు, రహీం, ఖాజా గౌడ్, గంధం పాండు, శోభన్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు……..

Related posts

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

TNR NEWS

*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*

TNR NEWS

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS

కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు

TNR NEWS

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs