Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతే కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

దళితులు అనే నెపంతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ముగ్గురు దళిత మహిళలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.

 

శనివారం స్థానిక నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసేటటువంటి ముగ్గురు దళిత మహిళా కార్మికులను దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతనేని అన్నారు.

 

మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సంబంధిత పాఠశాలకు వెళ్లి సమగ్రమైనటువంటి పరిశీలన చేయగా అక్కడ బోధించేటువంటి ఉపాధ్యాయులకు మధ్యాహ్న సమయంలో బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం లేదనే కారణంతో అక్కడ విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఉసిగొల్పి దళిత మహిళలకు భోజనం సక్రమంగా వండటం రావడం లేదని ఫిర్యాదు చేయించి విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు.అమ్మా ఆదర్శ కమిటీ చైర్మన్, అక్కడ లబ్ధి పొందాలని నేపముతో ఉన్న మరికొందరు మరియు అక్కడ ఉపాధ్యాయులు కలిసి అక్రమంగా దళిత మహిళలను విధుల నుంచి తొలగించారన్నారు.గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలే బాధిత దళిత మహిళలు బోయపర్తి అంజమ్మ, బోయపర్తి సుజాత బోయపాటి సుగుణమ్మ పాల్గొన్నారు.

Related posts

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

TNR NEWS

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

TNR NEWS

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు… సీఐ శివ శంకర్ నాయక్

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS