పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిందని, ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది అని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.