Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

పిఠాపురం : మహాశిరాత్రికి పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లు అన్ని సిధ్ధం అయ్యాయని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమీషనర్‌ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సంధర్భంగా బుధవారం సాయంత్రం ఆయన ఆలయ ఆవరణలో పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు మహాశిరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. మహాశివరాత్రికి పాదగయాక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంన్నామని, చంటి పిల్లలకు క్యూలైన్లలో పాలు, మంచినీరు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణం, 25వ తేదీ మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకములు మరియు గ్రామోత్సవం, 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి, 27వ తేదీ గురువారం రథోత్సవం, 28వ తేదీ శుక్రవారం త్రిశూల స్నానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాము – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra